అమిత్‌ షా, ఉద్ధవ్ థాకరేకు పంజాబ్‌ సీఎం కృతజ్ఞతలు

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఉద్దవ్‌ థాకరేకు పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ కృతజ్ఞతలు తెలిపారు. దేశవ్యాప్త లాక్‌డౌన్‌ నేపథ్యంలో మహారాష్ట్రలోని నాందేడ్‌లోని గురుద్వారా హజర్‌ సాహెబ్‌లో పలువురు సిక్కు యాత్రికులు చిక్కుకుపోయారు. వీరిని పంజాబ్‌కు తిరిగి పంపించాల్సిందిగా కోరుతూ సీఎం అమరీందర్‌ సింగ్‌ ఇరువురికి విజ్ఞప్తి చేశారు. స్పందించిన మహారాష్ట్ర సీఎం కార్యాలయం, కేంద్ర హోంశాఖ కార్యాలయం యాత్రికులను సురక్షితంగా పంపేందుకు చర్యలు చేపట్టాయి. ఇదే విషయాన్ని అమరీందర్‌ సింగ్‌కు ఫోన్‌ ద్వారా తెలిపారు. దీనిపై సంతోషం వ్యక్తం చేస్తూ వారి రవాణాకు అయ్యే ఖర్చు తామే భరిస్తామని అమరీందర్‌ సింగ్‌ అన్నారు.